Home » Mumbai Indians
నవీ ముంబై వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) తొలి మ్యాచ్లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 154 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) సీజన్ షురూ అయింది. తొలి మ్యాచ్లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచింది.
కోచ్లపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను కోచ్లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని విమర్శించాడు.
జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఎల్ కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ 2026 మినీ వేలానికి ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముంబై జట్టు తాజాగా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్ను ముంబై ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. మైదానంలో ఆటగాళ్లు ఎంతో కష్టపడుతుండటమే మనం చూస్తుంటాం.. తెర వెనకు జట్టును నడిపించే వారు వేరొకరు ఉంటారు. ఐపీఎల్లోని అనేక ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళలే.