Home » Maoist Encounter
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మెట్టగూడా అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఫ్యాక్టరీ నుంచి భారీఎత్తున విస్ఫోటక పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
భూపతి ఆడియో, వీడియోలపై మావోయిస్టు కేంద్రకమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుపై మండిపడింది.
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
ఛత్తీస్గఢ్లో తాజాగా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మృతి చెందారు. ఆయనతోపాటు మరికొంతమంది కీలక నేతలు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళా మావోయిస్టు హతమయ్యారు.
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ 7,500 మంది సంతకాలతో ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు వెల్లడించారు.
నాలుగు దశాబ్దాల అజ్ఞాతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్లకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు గురువారం చెక్కులను అందజేశారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి.
ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.