Home » Manipur
మణిపుర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. శనివారం ఇంఫాల్లో మైతీ సామాజిక వర్గానికి చెందిన సమగ్రత సమన్వయ కమిటీ నిర్వహించిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు మరోసారి వణికించాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 5:59 గంటల ప్రాంతంలో మణిపూర్ సహా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో భూ ప్రకంపనలు సంభవించాయి.
మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారితీసింది.
మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు.
మణిపూర్లోని కాంగ్పోక్పి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన కిప్గేన్ గత ప్రభుత్వంలో వాణిజ్యం-పరిశ్రమలు, టెక్స్టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖలతో సహా పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎట్టకేలకు మణిపుర్లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సిద్ధమైంది.
మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను నియమించింది.
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.