Home » Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్న తరుణంలో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ... తుది ఫలితాలు మనవైపే ఉంటాయని వ్యాఖ్యానించారు.
దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు(సోమవారం) ప్రారంభమైంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.
దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్లలో కచ్చితంగా రీపోలింగ్ కోరాలని వారికి సూచించారు.
కోల్కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు.
భవానీపూర్లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్కతాలోని స్ట్రాంగ్ రూమ్కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.