Home » Maharashtra
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ సేనలో చీలిక తప్పదన్న వార్తల నడుమ పార్టీ నాయకత్వం తాజాగా ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది.
నాగ్పూర్లో (మహారాష్ట్ర) ఇటీవల వెలుగు చూసిన బలవంతపు మతమార్పిడి కేసులో పోలీసులు తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేశారు.
శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు.
పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన వస్తున్న ఉహాగానాలపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మౌనం వీడారు. పార్టీని వీడాలని కోరుకునే వారు వెళ్లిపోవచ్చని చెప్పారు.
పాత క్లేస్మేట్ను నమ్మి ఓ మహిళ దారుణంగా మోసపోయింది. మహిళ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసిన ఆ పాత క్లాస్మేట్ బెదిరింపులకు దిగాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయటమే కాకుండా.. లక్షల రూపాయల సొమ్ము కాజేశాడు.
మహారాష్ట్రలోని పండరీపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
రెబల్ ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ శివసేన లోనూ ఇదే తరహా పరిస్థితే కనిపిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో మంతనాలు సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఓ ఫుట్బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను అరెస్టు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.
విప్రో పుణె క్యాంపస్లో పని చేసిన ఒక మహిళ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన బాస్ బలవంతం చేశారని ఆరోపించారు.