Home » Maharashtra
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిందెవరో తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.
రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పులకు దిగిన ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. వీరిద్దరూ బాంద్రా రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టు ఈ ఫోటోల్లో ఉంది.
మరాఠా రిజర్వేషన్ల వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే అల్టిమేటం ఇచ్చారు. మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించకుంటే జూన్ 4వ తేదీ నుంచి మరోసారి తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్ఖాన్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్తో షిండే మాట్లాడి ఖాన్కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో తాజాగా ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ప్యాంటుకు బదులు షార్ట్స్ వేసుకున్న యువకుడిని సెక్యూరిటీ గార్డు బ్యాంకులోకి అనుమతించని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు నిలదీశారు. అమిత్షాతో జరిపిన సమావేశంలో రాజ్థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.
తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది. ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపుతుంది. అందుకే.. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. కానీ.. అందరూ తల్లులు అలా ఉండరు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాక్షస అవతారం ఎత్తుతుంటారు.