Home » Maharashtra
కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు.
మహారాష్ట్ర(maharashtra)లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరవులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వర్షం నేడు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పుణెతో పాటు రాయ్గఢ్, పాల్ఘ ర్ జిల్లాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.
మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూడిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా జులై 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. ఒక్క రోజే శిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి''పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్లో వారిద్దరూ సమావేశమయ్యారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్లో అమిత్షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
జెర్లీన్ డిసిల్వా డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా పని చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులతో కలిసి పాషాన్-బానేర్ లింక్ రోడ్డుపై స్కూటీపై వెళుతున్నారు. రహదారి ఎడమవైపున వెళ్లేందుకు బాగోలేదు. అందుకోసమే కార్లు వెళ్లే మార్గానికి వచ్చారు. ఓ వృద్దుడి కారుకు సైడ్ ఇవ్వడం వీలు పడలేదు. ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆ మహిళపై సీరియస్గా ఉన్నాడు.