Home » Madakasira
స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో హిందూ మహాగణపతి సంఘం ఏర్పాటు చేసిన మహాగణపతి శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు.
‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి.
తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైస్ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్చేస్తామని తహసీల్దార్ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్ తన సైకో బ్యాచ్తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.