Home » Machilipatnam
మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లు అయింది.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
Andhrapradesh: ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కన పెట్టేసిన వాలంటీర్లు.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై వేటు వేస్తోంది.
Andhrapradesh: జిల్లాలోని మచిలీపట్నంలో ప్లెక్సీల రాజకీయం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పేర్ని నాని మౌఖిక ఆదేశాలతో టీడీపీ ప్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి..
గుంటూరు జిల్లా: ఏపీ ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించాలన్నదే తమ లక్ష్యమని, పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని జెండా సభ ద్వారా జనసైనికులు చాటి చెబుతారని, మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటు స్థానాలు నుంచి జెండా సభకు తరలి వెళ్తున్నామని ఎంపీ బాలశౌరి వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి రోడ్ల మీద పడి జనసేన ఫ్లెక్సీలనుపేర్ని నాని అనుచరులు తొలగించారు. మొన్న జనసేన దిమ్మను తొలగించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. నిన్న అర్ధరాత్రి జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు పడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నంలో బూత్ కన్వీనర్ల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం నిర్వహించారు.
MP Balashowry: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) పరిస్థితులు అల్లకల్లోల్లంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో వైసీపీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి..
YSRCP Resigns: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్లో రాజీనామా చేయగా.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.