Home » Lok Sabha
ఇండియాలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
తాను ఎల్లప్పుడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించానని, ఇకపైనా తన విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగానే నిర్వహిస్తానని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
లోక్సభ స్పీకర్ అంటే ఇంతకు ముందు తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ రుణాలు కింద మొత్తం రూ.31,34,807 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం లోక్సభలో డీఎంకే సభ్యుడు రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...
ఎప్స్టీన్ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.