Home » Lok Sabha
విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ గురువారానికి వాయిదా పడింది. దీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా గురువారానికి వాయిదా పడింది.
మంగళవారం నాడు లోక్సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై వేటు పడింది. స్పీకర్ వైపునకు పేపర్లు విసిరినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు.
విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా.. అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారని, చేతులు కూడా వణికాయని చెప్పారు రాహుల్.
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్షా చెప్పారు.
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్షా అన్నారు.