Home » Lok Sabha
లోక్సభలో జరుగుతున్న చర్చపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మహిళా బిల్లు కాదని, 2023లోనే బిల్లును పార్లమెంటులో ఆమోదించారని అన్నారు. ఎన్నికల మ్యాప్ను మార్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు.
లోక్ సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులపై మరికొద్ది సేపట్లో లోక్ సభలో ఓటింగ్ జరగనుంది.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది.
లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన 'మొసలి కన్నీళ్లు'గా అభివర్ణించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కేవలం మౌలిక వసతుల కల్పనే వికసిత్ భారత్ కాదని.. మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు.
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్సభ స్థానాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో భరోసా ఇచ్చారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్యగా అభివర్ణించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు లోక్సభలో నివాళులర్పించారు. అనంతరం ప్రధాన బిల్లుపై చర్చ మొదలైంది.