Home » Local Body Elections
బాన్సువాడ మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. గుప్త రాజకీయ కదలికలు, కోవర్టు కార్యకర్తల వ్యూహాలతో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనలో పడుతున్నారు. బలం, బలహీనతల సమాచార సేకరణ, రహస్య మీటింగ్స్ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వీణవంక మండలంలోని 28 గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాల కోసం గ్రామాల్లోని పెద్దలు అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టు పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు అవకాశం ఇవ్వలేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో ఓటర్లకు, కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో పలు చోట్ల కొత్తగా గెలిచే సర్పంచ్లకు పాలన పగ్గాలు చేపట్టేందుకు సొంత భవనాలే కరువయ్యాయి. పలు చోట్ల పాఠశాలలు, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. దీంతో పంచాయతీ సమావేశాలు నిర్వహించేందుకు పాలకవర్గ సభ్యులు అవస్థలు పడుతున్నారు.
జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సవాలుగా మారాయి. ఎక్కువ స్థానాలు గెలుచుకుని తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల వ్యూహాలతో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.
ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి.. ఓట్లను కొల్ల గొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకుంటున్నాయి.
స్థానిక ఎన్నికల తరుణంలో ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు అభ్యర్థులు. దీంతో వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా మీట నొక్కడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఎన్నికల పోలింగ్లో అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఏంటన్న ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తిందా? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? నోటా ప్రాధాన్యం ఏంటి? ఆ వివరాలు మీకోసం..
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే.. సర్పంచ్ అధికారాలేంటి? నిర్వర్తించాల్సిన విధులేంటనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం..
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ్, వార్డు మెంబర్గా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో ఒకవైపు గ్రామంలో నివాసముంటున్న ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నారు.