Home » Local Body Elections
స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 1.36లక్షల పోలింగ్ బూత్లను గుర్తించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్ధారణకు సంబంధించి సోమవారం తుది ప్రకటన జారీ చేసింది.
కూటమి ధర్మాన్ని పాటిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతుందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. 2021 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా జనసైనికులు, వీరమహిళలు గొప్ప పోరాట పటిమ చూపించారని కొనియాడారు.
పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థంగా అమలు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతోంది. ఈక్రమంలోనే విధివిధానాల రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు.
కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘సర్’ (ఎస్ఐఆర్) తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబరు 3న అమల్లోకి వస్తుందని... ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబరు 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది. ఏకగ్రీవం అయ్యే స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను కూడా ఇస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి సోషల్ మీడియా ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పందించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు.
డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఐదోసారి సవాల్ విసిరారు. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. చర్చకు నేను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది.