Home » Local Body Elections
సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకొని మరికొందరు భూములు ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో దారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచి ఓడిన వారు తలలు పట్టుకుంటున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
లింగ మోరిగూడెంలో ప్రతిపక్ష అభ్యర్ధి రెండుసార్లు చికెన్ ఇంటింటికీ పంపించారు. పోలింగ్కు ముందు రోజు ఓటుకు రూ.750ల నగదు, కిలో చికెన్ అందులో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్, లేదా బీరు చొప్పున ఇవ్వడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి.
పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వారికి విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కామారెడ్డిలోని సోమార్పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు.
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. 3,911 సర్పంచ్, 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యం కరబరుస్తున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.
సర్పంచ్ ఎన్నికల్లో చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో రెండో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.