Home » Local Body Elections
కొమురంభీం ఆసిఫాబాద్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అభ్యర్థులు ప్రచార పర్వం కొనసాగిన ప్రతిరోజు మందు, మాంసంతో విందులు కొనసాగించారు. పల్లెలను మత్తులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇంటింటికి వెళ్లి గడపకు బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకొని మరికొందరు భూములు ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో దారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచి ఓడిన వారు తలలు పట్టుకుంటున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
లింగ మోరిగూడెంలో ప్రతిపక్ష అభ్యర్ధి రెండుసార్లు చికెన్ ఇంటింటికీ పంపించారు. పోలింగ్కు ముందు రోజు ఓటుకు రూ.750ల నగదు, కిలో చికెన్ అందులో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్, లేదా బీరు చొప్పున ఇవ్వడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి.
పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వారికి విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కామారెడ్డిలోని సోమార్పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.