Home » Latest News
హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.
బ్యాంక్లో నగదు దాచుకున్నట్లు మనం నీటిని భూమిలో దాచుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు.
కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
చెన్నై నగరంలోని పోరూరులో నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. తన అపార్ట్మెంట్లో సోమవారం ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీతోపాటు ఆసుపత్రి సేవలు ఈ ఏడాది ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ మెడికల్ కాలేజీ, బోధన ఆసుపత్రి నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.