Home » Latest News
సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
తెలంగాణలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని.. బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) కేడర్కు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి(Deepa Dasmunshi) కీలక సూచనలు చేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాలు పోలింగ్ బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని తెలిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రాజీకీయ పార్టీలు ప్రచార అనుమతులు పొందడానికి సువిధా పోర్టల్ను వినియో గించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులకు సువిధా పోర్టల్ ద్వారా తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్న(ఆదివారం) తాను దేవరుప్పుల మండలం లక్ష్మి భాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.
ఐఎండీ సూచనల ప్రకారం జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు(బుధవారం) భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్(MA Sharif) మంగళవారం నాడు ఓ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా, గడికోటకు చెందిన మునియ్యపై వైసీపీ(YSRCP) మూకలు దాడి చేసి హత్య చేసిన ఘటనపై లేఖలో సీఈఓకు వివరించారు. మునియ్యపై వైసీపీ మూకలు సోమవారం అతి దారుణంగా దాడి చేశారని చెప్పారు. మునియ్య తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే కారణంతోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని చెప్పారు.