Home » Latest News
మెక్సికోలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్టింగ్లో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు.
మధ్యప్రదేశ్లో ఆదివారం రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. బిహార్లోని ససారంలో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది.
బీఆర్ఎస్లో కొత్త నేతల చేరిక కొందరికి నచ్చడం లేదు. పార్టీ కార్యక్రమాలను గాలికొదిలేసి కూర్చున్నా.. వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వం పిలిచి సీట్లు ఇస్తుందనుకుంటోన్న నేతల ఆశలు గల్లంతు అవుతోన్నాయి.
పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజ్ మోహన్కి ఫిల్మ్ టెక్నాలజీ & సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అప్పగించడంపై ప్రముఖ సినీ హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ డైనో డీట్స్ (Dino Deets) ప్రారంభించారు. అందుకు సంబంధించిన టీజర్ను ఆదివారం విడుదల చేశారు.
బండి భగీరథ్ ఎపిసోడ్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కేసులో మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రిజిస్ట్రార్ ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.