Home » Latest News
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కుంపటిలా మారాయి. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి పతాక స్థాయికి చేరాయి.
సింధు జలాల ఒప్పందంపై భారత్ మరోసారి పాకిస్థాన్కు హెచ్చరికలు జారీచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలని లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్ను ప్రారంభించారు.
ఇండియన్ నేవీలో ఆఫీసర్గా చేరాలనుకునే యువతకు శుభవార్త. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీలో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సు కోసం మొత్తం 275 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశంలోనే తొలిసారిగా ఈడీ ఈ-వేలం ద్వారా ఓ విమానాన్ని విక్రయించింది. జులై 1న ఆక్షన్ నిర్వహించగా రూ.3 కోట్లకు సదరు విమానం అమ్ముడుపోవడం విశేషం.
రోజూ అల్లం, వెల్లుల్లి శుభ్రం చేసి పేస్ట్ తయారు చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మార్కెట్లో దొరికే రెడీమేడ్ పేస్ట్ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి, నిల్వ చేస్తే కొన్ని నెలల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.
దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో 7 రోజుల యాత్రను అందుబాటులోకి తెచ్చింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.