Home » KTR
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం, వాహనాలపై బీజేపీ శ్రేణుల దాడులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పట్టపగలు గూండాల్లా వచ్చి.. వాహనాలు, ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రైతుబంధును బంద్ పెట్టి రాహుల్ బంధు తెచ్చారని.. రాహుల్గాంధీ ఖాతాల్లో నిధులు జమచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పట్టుతప్పాయని, రాష్ట్రం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న వారిద్దరూ ఆయనతో సమావేశమయ్యారు.
సీఎంపై హాట్ కామెంట్స్తో నిరంతరం మీడియాలో ఉండాలన్న తపన తప్పితే కేటీఆర్కు ఇంకో పని లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ భవన్కు ఎవరినో ఒకరిని పిలిపించుకుని చిల్లర మల్లర అహంభావపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023 తర్వాత బీఆర్ఎస్కు చాలా షాక్లు తగిలాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని.. కేసీఆర్కు రెండోసారి ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు.