Home » Kollu Ravindra
Kollu Ravindra Fire On Perni Nani: మద్యంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని.. సిట్ను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ వేసిన సాయంత్రం తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు..? ముందస్తు బెయిల్ ఎందుకు అని ప్రశ్నించారు.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అన్నింటిలో అవినీతి జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో మద్యంఅమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రూ.3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు.
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు.
ఒంగోలులో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
AP Ministers: మాజీ సీఎం వైస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు మంత్రి కొల్లురవీంద్ర. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు.