Home » Kishan Reddy G
గోపరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు సబ్సిడీలు అందిస్తున్నాయని ఉద్ఘాటించారు.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు.
పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్, కవిత గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దశాబ్దం క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. నేడు 11కు తగ్గాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారతాయని ఆశిద్దామని ఆకాంక్షించారు.
పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోస పోవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని కిషన్ రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలనలో మజ్లీస్ పార్టీ భుజాల మీద మోశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందని తెలిపారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు డయాబెటిస్ సమస్య కూడా దేశంలో పెరిగిందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు సహకారం ఎందుకు అందించడం లేదని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.
అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆన్లైన్లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్రెడ్డి తెలిపారు.