Kishan Reddy: వైద్య రంగంలో భారత్ విశ్వగురు కావాలి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:44 PM
దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు డయాబెటిస్ సమస్య కూడా దేశంలో పెరిగిందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ: భారత్ వైద్యరంగంలో వసతులు మరింత పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డాక్టర్ విజయనంద్ రచించిన 'నేను క్యాన్సర్ను జయించాను' అనే పుస్తకాన్ని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంబీబీఎస్ పీజీ సీట్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. గతంలో 387 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 808 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. విదేశాలతో పోలిస్తే భారత్లో మెరుగైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.
అలాగే దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు డయాబెటిస్ సమస్య కూడా దేశంలో పెరిగిందని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యధిక డయాబెటిస్ బాధితులు హైదరాబాద్లోనే ఉన్నారని పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ విశ్వ గురువు కావాలని ఆయన సూచించారు. రోగులపట్ల నిజమైన దేవుళ్ళు డాక్టర్లే అని స్పష్టం చేశారు. క్యాన్సర్ వస్తే ప్రాణంపై ఆశలు ఉండవు అని వివరించారు. కానీ ఇప్పుడు క్యాన్సర్ను ఎంతోమంది జయిస్తున్నారని అన్నారు. దీంతో బాధితుల్లో క్యాన్సర్పై గెలుస్తామనే విశ్వాసం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.
మెడిసిన్ మాత్రమే కాదు, డాక్టర్లు ఇచ్చే విశ్వాసం కూడా రోగులను బ్రతికిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలో రోజురోజుకు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారని గుర్తు చేశారు. క్యాన్సర్ వచ్చాక దాన్ని జయించిన సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయని చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యాక కోలుకున్న వాళ్ళు మాత్రం తక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ అరుణ్ జెట్లీలతో పాటు ఎంతోమంది కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారని గుర్తు చేశారు. కిడ్నీల విషయంలో మరింత పరిశోధనలు జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్మాల్!