Home » Kishan Reddy G
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.
నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ రద్దు చేయడానికి గల కారణాలపై విచారించేందుకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని వేసింది. ఈ ఇద్దరు అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని.. మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరును మార్చామని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు.
ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.