Home » Khairatabad
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈనెల 6వ తేదీ నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.
రేపు మహా నిమజ్జనం. హుస్సేన్సాగర్తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం ట్యాంక్బండ్పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్ సూచించారు. గురువారం ఉదయం నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు.
మహానిమజ్జనం ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రాచకొండ కమిషనర్ సుధీర్బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్లతో కలిసి బుధవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఖైరతాబాద్ గణపతిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ చూసినా భక్తజనమే కనిపించింది.
ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల సమయం పడుతోంది.
ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి పూజలు వినాయక చవితి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 మంది పోలీసులు గణపయ్య ప్రాంగణంలో గస్తీ కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.