Khairatabad Maha Ganapati: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి రావొద్దు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:46 AM
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్ సూచించారు. గురువారం ఉదయం నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు.
- బడా గణేశ్ నిమజ్జన పనులు ప్రారంభం
ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Maha Ganapati) దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్(Saifabad Division ACP Sanjay Kumar) సూచించారు. గురువారం ఉదయం నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు. గణపతిని తరలించే భారీ ట్రాలీపై బేస్ పనులకు వెల్డింగ్ చేస్తున్నారు.

గణపతిని తరలించే ట్రాలీకి రథసారధిగా ఈసారి ఎం.వెంకట్ రెడ్డి వ్యవహరించనున్నారు. భారీ గణపతిని ఈయన గతంలో మూడు సార్లు తరలించిన అనుభవం ఉంది. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన లో బెడ్ వాహనాన్ని శోభాయాత్రకు వినియోగిస్తున్నారు. ఇది 100 టన్నుల బరువును తరలించగలదు. గణపతి దాదాపు 60 టన్నుల బరువుంటాడు. 26 టైర్లతో ఉన్న ఈ వాహనం 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News