Home » Kerala
కేరళలో ఇటీవల మరణించిన ఓ యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అతడి డబ్బాలో ఈ డబ్బును పోలీసులు గుర్తించారు. అలప్పుళ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.
కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది బైకులు కాలి బూడిదయ్యాయి.
విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కేరళలోని తిరువనంతపురంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వైద్యుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా...
టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ (18189) రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రాణ భయంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ లోపు లోకో పైలట్ బోగీలను రైలు నుంచి వేరు చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కార్తీక మాసం మొదలైందంటే చాలు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తుంటారు. అయ్యప్ప మాల అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. 41 రోజుల పాటు కఠిన నియమ, నిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండల దీక్ష చేపడతారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్ను నిర్వహించారు.
కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్గఢ్లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.
కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...