Home » Karnataka
ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.
భాస్కర్ అనే వ్యక్తి స్కూటీ నడుపుతున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డుపై వేగంగా వెళుతున్న స్కూటీపై చెట్టు విరిగిపడింది. వెనకాల కూర్చున్న కీర్తనపై చెట్టు పడ్డంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు.
పెళ్లైన నాటినుంచి సయ్యద్ భార్యను ప్రతీరోజూ వేధిస్తూ ఉండేవాడు. తనకు 19 మంది మహిళలతో సంబంధం ఉందంటూ భార్య ముందు గర్వంగా చెప్పుకునేవాడు.
చోరీ చేసిన పశువుల్ని తన నివాసంలో వధిస్తూ వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తోన్న ఒక అక్రమ యూనిట్ పై పోలీసులు దాడులు చేశారు. దక్షిణ కర్ణాటకలోని బంట్వాల్ గ్రామంలో హసనబ్బా అనే వ్యక్తి..
మార్కెట్లో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా తగ్గిపోవడం రైతులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరాకు చెందిన రైతు ఒకరు వారం రోజుల క్రితం ఉల్లిపాయ పంటను రాయచూరు ఏపీఎంసీ మార్కెట్ కు తీసుకురాగా ధర పూర్తిగా పడిపోవడంతో వారం రోజులుగా పడియావులు పడుతున్నాడు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది. గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
మైసూరు దసరా ఉత్సవాల్లో ఈసారి డ్రోన్షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్ సరఫరా కంపెనీ (సెస్క్) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.