Home » Karnataka
కన్నడ నటుడు దర్శన్కు సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ బెయిల్ను గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.
వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు కొడుకు మృతిచెందాడు. తండ్రి ఆ మృతదేహాన్ని ఇంటి వెనుక ఇంకుడు గుంతలో పాతిపెట్టాడు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.
ఇటీవల తుమకూరు జిల్లా కొరటగెరెలో లక్ష్మీదేవి అనే మహిళను ముక్కలుగా కత్తిరించి ప్లాస్టిక్ కవర్లలో వేసి పలుచోట్ల పడేసిన కేసును పోలీసులు చేధించారు. డెంటిస్ట్ అయిన అల్లుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. దంత వైద్యుడు రామచంద్రప్ప సహా అతడి సహచరులు ఇద్దరిని అరెస్టు చేశారు.
కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామాను సమర్పించారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను రాజన్న బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో మన పార్టీ నాయకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
'దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము' అని ఈసీ తన నోటీసులో రాహుల్ గాంధీని కోరింది.
ధర్మస్థల వివాదంలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. గతంలో ధర్మస్థలలో పారిశుధ్య కార్మికులుగా
ప్లీజ్.. ఈ కేసులో నా ప్రియురాలిని తీసుకురాకండి అంటూ డెత్నోట్ రాసిపెట్టి దావణగెరె జిల్లా న్యామతి తాలూకా మాచిగొండనహళ్ళికు చెందిన యశ్వంత నాయక్ (24) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యశవంత నాయక్ తల్లి చేసిన ఫిర్యాదుతో పాటు డెత్నోట్లోని అంశాలను పోలీసులు మీడియాకు తెలిపారు.
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్ మహమ్మద్ నిసార్ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ధర్మస్థళ సమీపంలోని ఉజిరే వద్ద సువర్ణ చానల్ రిపోర్టర్తో పాటు ముగ్గురు యూట్యూబర్లపై స్థానికులు