Home » Karnataka
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రముఖ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్కు ఐదు పదులలో మరోసారి ప్రేమ చిగురించింది. ఈనెలాఖరున ప్రముఖ గాయని వారిజాశ్రీ వేణుగోపాల్తో వివాహం కానుంది. బహుభాషా జానపద సంగీత ప్రముఖుడిగా రఘుదీక్షిత్కు పేరుంది.
ఆర్ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
ఓ యువతి బస్టాండ్లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు.
యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్ సీఐ జనార్దన్ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు.
స్వర్ణకు తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రి మూడు నెలల క్రితం ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తట్టుకోలేకపోయింది.
నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను శివకుమార్ ఇటీవల హెచ్చరించారు. సీఎం మార్పు గురించి మాట్లాడే వారికి నోటీసులు ఇవ్వాలని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.
భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది.