Home » Karnataka
ధర్మస్థల పుణ్యక్షేత్రంపై అనవసర ఆరోఫలు చేయడం తగదని బీజేపీ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి నేతృత్వంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా రాయల్ సర్కిల్లో మానహారం ఏర్పడి ధర్మస్థలపై ఆరోపణలు చేయడం మంచిది కాదని నినదించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు ఊహించని విధంగా కీలక మలుపు తిరిగింది. వందలకొద్దీ మృతదేహాలను పలుచోట్ల ఖననం చేశానంటూ ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు 'భీమా'ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శుక్రవారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న తర్వాత ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద 'విక్టరీ సెలబ్రేషన్స్' ఏర్పాటు చేయగా తొక్కిసలాటకు దారితీసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర వివరణ ఇచ్చారు. ఈ విషాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ జిల్లాల జిల్లాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తిరుమలలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.
కర్ణాటక దెవనగరి జిల్లాలో నాలుగు నెలల క్రితం కుక్క దాడిలో గాయపడ్డ నాలుగు ఏళ్ల చిన్నారి బెంగళూరులో చికిత్స పొందుతూ దుర్మరణం చెందింది.
నగరంలోని శ్రీరామ నగర్ పరిసరాల్లో సోమవారం బాలిక అక్కనాగమ్మతోపాటు మరో నలుగురు వ్యక్తులు రంగణ్ణ, మంజునాథ్, పూజాల పై నక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఆహారం కోసం వెతుకుతూ నగరంలోకి ప్రదవేశించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పరిసరాల్లో ఆడుకుంటున్న బాలికపై నక్క దాడి చేస్తు పక్కనే ఉన్న వ్యక్తుల పై కూడా దాడికి దిగింది.
హత్యకేసులో విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటుడు దర్శన్, పుస్తకాలు చదివేందుకు సిద్ధమయ్యారు. నాలుగురోజులుగా ఏకాంతంగా గడుపుతున్న దర్శన్, పలు పుస్తకాలను తన బ్యారక్లో ఉంచుకుని చదువుతున్నట్లు సమాచారం.