Home » Karimnagar
రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అదికారులను, సెంటర్ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.
రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్ కెనాల్ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.
’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచిపోయింది. కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆరు లక్షల రూపాయలకు మగబిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది.
కన్న బిడ్డ పట్ల తల్లి దారుణంగా ప్రవర్తించింది. పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చేసుకోవాల్సిన ఆ తల్లి.. ఏకంగా బిడ్డను అమ్మకానికి పెట్టేసింది.
అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్అండ్డీ సెక్షన్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
దేశంలో అట్టర్ ప్లాప్ సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బయోమెడికల్ వ్యర్థా లను మున్సిపల్ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ క్లినిక్స్, స్కాన్ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.