Home » Karimnagar
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అనవసర నియామకాలు చేశారని వస్తున్న అభియోగాలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుందనే ప్రచారం సింగరేణిలో కలకలం సృష్టిస్తున్నది. గత ప్రభుత్వ కాలంలో మెడికల్ అన్ఫిట్ కేసుల్లో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ వారసులకు ఉద్యోగాలు కల్పించారనే అభియోగాలు ఇప్పుడు సింగరేణిలో కల్లోల్లాన్ని కలిగిస్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో నడుస్తున్న ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నడిపించా లంటూ మంగళవారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్కుమార్ సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
రామగుండం ఎన్టీపీసీలో మరో కొత్త ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేశామని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పక్కన ఉన్న స్థలంలో 176 మెగావాట్ల సామర్థ్యం గల కంబైన్డ్(ఫ్లోటింగ్, సర్ఫేస్) సోలార్ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, గ్రిడ్ నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్(సివొడి) ప్రకటించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు 18 వేల రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతీ శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్ట రేట్లో 99 రోజుల కార్యాచరణపై అదనపు కలెక్టర్ డి.వేణు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
గొర్రెకాపరుల సమస్యలు పరిష్కరించాలని కాపరులు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొంగడి ధర్నా నిర్వహించారు. గొర్రెల కాపరులు సంప్రదాయ గొంగడి ధరించి కలెక్టరేట్ చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు.