Home » Karimnagar
రామగుండం నగరాన్ని సుందరీ కరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 7వ డివిజన్ వార్డు సందర్శనలో భాగంగా కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటికి తగిన అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జయశంకర్ జయంతి తోపాటు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
రైతులకు సాగునీరు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
జగిత్యాల జిల్లాలో బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. కండ్లపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థిని బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది.
రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా మారుతోంది.
ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సునీల్రెడ్డి అన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జెఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థులను కలిసారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి నాణ్యమైన వైద్య సేవలను సకాలంలో ఆందేలా వైద్యాధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు.
పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు.
జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల మధ్య అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.