• Home » Karimnagar

Karimnagar

ఖని  ఆసుపత్రిలో సకాలంలో అందని వైద్యం

ఖని ఆసుపత్రిలో సకాలంలో అందని వైద్యం

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. దాదాపు రెండు గంటల పాటు క్షతగాత్రుడు విలవిలలాడాడు. రోగి అవస్థను చూసి అక్కడ ఉన్న మిగతా వారు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు

మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు

మహాశివరాత్రికి గోదావరిఖనిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కోదండ రామాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్‌లో ‘మేయర్’ పదవి కోసం ఒక్కటైన మూడు పార్టీలు

కరీంనగర్‌లో ‘మేయర్’ పదవి కోసం ఒక్కటైన మూడు పార్టీలు

కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.

ఆర్థిక అక్షరాస్యతపై  అవగాహన

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

నర్సా పూర్‌లో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలం గాణ గ్రామీణ బ్యాంకు నర్సాపూర్‌ శాఖ ఆధ్వ ర్యంలో సదస్సులో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సైబర్‌ క్రైమ్‌ మోసాలపై వివరించారు.

వైభవంగా ఓదెల మల్లికార్జున స్వామి కల్యాణం

వైభవంగా ఓదెల మల్లికార్జున స్వామి కల్యాణం

ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత నూతన వధూవరులు భ్రమ రాంబ మల్లికార్జునస్వామిని కల్యాణ వేదికపై ఆసీనులు చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ మూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

మెరుగైన వైద్యసేవలు అందించండి

మెరుగైన వైద్యసేవలు అందించండి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని, వైద్యులు సమయపాలన పాటించా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.

రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారు

రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారు

రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సిరిసిల్లలో ఎగిరిన బీఆర్ఎస్ జెండా

సిరిసిల్లలో ఎగిరిన బీఆర్ఎస్ జెండా

సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 27 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు.

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ పీఠంపై విపక్ష బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమకు 20 నుంచి 25శాతం సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్న ఆ పార్టీ నాయకులు క్యాంపులు మొదలుపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి