Home » Karimnagar
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని యూఎస్పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ యాకన్నకు వినతిపత్రం అందించారు.
నేత్రదానం, అవయవాల దానం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలని తహసీల్దార్ వనజ కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంలో భాగంగా గురువారం కస్తూర్బా కళాశాలలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రధా ని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహిం చిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆయన ప్రారం భించారు.
కుడి ఎడమైతే పొరపాటులేదోయ్... అన్నాడు ఓ సినీ కవి. అందరూ కుడి చేతులతో పనులు చేస్తే కొందరు ఎడమచేతితో పనులు చేస్తుంటారు.
గిరిజన తండా ల్లో సంస్కృతి, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగల్లో తీజ్కు ప్రత్యేక స్థానం ఉంది.
ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజులపాటు వర్షాలే కురవలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
వృద్ధులు, ఇతర బాధితులకు ఆర్థిక భరోసానిచ్చే చేయూత పింఛన్ల పంపిణీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్దా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ప్రభుత్వఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జి
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటిం చేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశించారు.