Home » Karimnagar
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్ మానిటరింగ్) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినా వేగం పుంజుకుంటున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తుండడంతో కొనుగోళ్లలో వేగం పెరి గింది. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, రోజుకు కనీసం 15 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి 42 వేల టన్నులు వెనుకబడినప్పటికీ వేగం పెరిగింది.
యుఐడిఎఫ్ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్తో ఆయన సమీక్షించారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.
సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం ఐడిఓసీ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ కెమిస్ట్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులను బంద్ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్ చేశారు.
భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ ట్రైసైకిళ్లను అందజేశారు.