Home » Karimnagar
పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహం సందర్భంగా మంగళవారం ఉదయం పూజారులు మూసి వేశారు. సాయంత్రం చంద్రగ్రహణం కావడంతో ఉదయం వేళలోనే ఆల యాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశారు.
గోదా వరి నది పుష్కరాలు-2027 దృష్ట్యా రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించారు.
ఈసాల తక్కళ్లపల్లి బీట్కు చెందిన బుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి అటవీ రేంజ్ అధికారి సతీష్ కుమార్ అఽధ్వర్యంలో పారెస్టు అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ, శుభ్రత చేపట్టారు.
యువత కేరింతలు, నృత్యాలు, చిన్నారుల సందడి మధ్య జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు మంగళవారం వైభవంగా సాగాయి. ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. మున్సిపల్ కౌన్సిల్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దకాలంగా నిధులు లేక ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఎట్టకేలకు ఆత్మ పథకానికి మోక్షం లభించింది.
రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో గత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి జీపీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి.
రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక గ్రామాలు అనేక సమ స్యలతో కొట్టుమిట్టాడాయి. చాలా గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుతీరడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్లు పాత బకాయిలు ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుత, మాజీ సర్పంచుల మధ్య బిల్లుల గొడవకు దారి తీసింది.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలు స్తున్నది. పరిశ్రమలో ఈ ఏడాది సాంకేతిక అవరోధా లతో ఉత్పత్తి నిలిచిపోవడం, నష్టాల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని, ఈ మేరకు వేతన భారం కూడా తగ్గించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజ ర్స్ (డీవోఎఫ్) సూచించినట్టు సమాచారం.
హోలీ పండుగను పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం కామ దహనం వేడుకలను మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ సమత దంపతులు సోమవారం రాత్రి ప్రారంభించారు.
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెంకట్రావుపల్లిలో సోమవారం ఎమ్మెల్యే పాఠశాల ప్రహరీకి రూ.10 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, స్వశక్తి మహిళా భవన నిర్మాణానికి రూ.10లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.