Home » Kalvakuntla kavitha
ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత. ఖైరతాబాద్లో రాస్తారోకో నిర్వహించారు. బీసీ బంద్లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు.
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీసీల బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు కవిత.
చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొనే మనస్తత్వం తనది కాదని, అందుకే.. జాగృతి జనంబాటలో తన తండ్రి కేసీఆర్ ఫొటో పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లో లేను ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై తోవ వెతుక్కుంటున్నా... ‘మా దారులు వేరయ్యాయి.. అలాంటప్పుడు ఆయన ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు.
కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు కవిత. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలు ఇవ్వడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలంగాణ జాగృతిలో చేరిన వారికి ఆమె పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారు ఉసురుపోసుకోవద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల త్యాగఫలితమే ప్రత్యేక తెలంగాణ అని గుర్తు చేశారు.
పరీక్ష రాసిన విద్యార్థులు.. ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు రాసిన పేపర్లు బయట పెట్టమని అడుగుతున్నారని కవిత అన్నారు. 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినం అని అంటున్నారని విమర్శించారు.