Home » Kalvakuntla Chandrasekhar Rao
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..
కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్య జరుగుతున్న నోటీసుల పర్వం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా సిట్ వేగవంతమైన చర్యలు చేపట్టింది.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ని సిట్ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకుని, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పోలీసులు ఇంటి పరిసరాలను తనిఖీలు చేసినట్లు సమాచారం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద, కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించారు..
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..