Home » Kaleshwaram Project
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్, హరీష్రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి ఇవ్వడంలో కాంగ్రెస్ కావాలనే జాప్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు....
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై లోతైన విచారణ జరపాలని కోరుతూ ఒకటి, రెండు రోజుల్లో సీబీఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు..
కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై శాసనసభలో ఆదివారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడగా..
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏకపక్షమని, అందులో అబద్ధాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలు క్యాబినెట్ ముందు పెట్టారా? అని పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించగా..
కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడ కట్టాలో గూగుల్ మ్యాపుల్లో చూసి నిర్ధారించారా? భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు అలైన్మెంట్, సామర్థ్యం, నిర్మాణ రకాలకు కూడా గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడ్డారా? కాళేశ్వరాన్ని గత పాలకులు సాంకేతిక ప్రాజెక్టుగా కాకుండా..