• Home » Kadiri

Kadiri

ELECTRIC : పరిష్కారం కాని విద్యుత కష్టాలు

ELECTRIC : పరిష్కారం కాని విద్యుత కష్టాలు

అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ICDS: తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

ICDS: తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

MLA: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

MLA: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. టీఎనఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్‌ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్‌ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.

EDUCATION: అర్ధాంతరంగా ఆగిన నాడు - నేడు

EDUCATION: అర్ధాంతరంగా ఆగిన నాడు - నేడు

మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు.

WATER: నిర్మించారు - వదిలేశారు

WATER: నిర్మించారు - వదిలేశారు

మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.

MLA : సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం

MLA : సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటినుంచి సుపరిపానలతో ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలనకు తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్య క్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ బుధవారం రూరల్‌ పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో ప్రారంభించారు. అలాగే ఆయన నంబులపూలకుంట మండలంలో ని కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు.

CLINIC: హెల్త్‌ క్లినిక్‌  ప్రారంభం ఎప్పుడో..?

CLINIC: హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభం ఎప్పుడో..?

మండలపరిధిలోని సోమ యాజులపల్లిలో విలేజీ హెల్త్‌ క్లినిక్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గ్రామీణులకు వై ద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వంలో దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో రూ. 23లక్షల నిధులు కేటాయించారు. దీంతో నిర్మాణం పూర్తి అయి యేడాది అవుతోంది. అయితే కాంట్రాక్టర్‌కు ఇంకా 20శాతం బిల్లులు రావాల్సిఉందని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు అంటున్నారు.

DRUGS: డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

DRUGS: డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తహసీల్దార్‌ సురేశకుమార్‌ తదితరులు సూ చించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం వనటౌన, టూటౌన పోలీస్‌ స్టేషనల ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు తదితరులు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ సురేశకుమార్‌, ఎంఈఓ గోపాల్‌నాయక్‌, టూటౌన సీఐ రెడ్డప్ప, రూరల్‌ సీఐ ప్రభాకర్‌, ముదిగుబ్బ రూరల్‌ సీఐ శ్యామరావు, ఎక్సైజ్‌ శాఖ సీఐ చంద్రమణి హాజరయ్యారు.

MLA: మానసిక రోగి జగన

MLA: మానసిక రోగి జగన

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మా నసిక రోగి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే గురువారం పట్టణంలోని 20వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షు డు జగన్మోహనరెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికెళ్లి అడగాలని వైసీపీ నాయకుల కు చెబుతున్నారన్నారు.

SCHOOL:  అసంపూర్తి నిర్మాణాలతో ఇబ్బందులు

SCHOOL: అసంపూర్తి నిర్మాణాలతో ఇబ్బందులు

మండలంలోని జౌకల కొత్తపల్లి లో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో దాదాపు 80మందికి పైగా చదువుతున్నారు. ఈ పాఠశాలకు గత వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడు పథకం కింద మూడుఅదనపు తరగతి గదులు, వంటగదితో పాటు మరుగుదొడ్లను మం జూరు చేశారు. పనులు మొదలు పెట్టి గోడల వరకు నిర్మించారు. అక్కడి తో పనులు అగిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి