Home » KADAPA
వాడవాడ లా జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువు రు ప్రముఖులు కృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శ్రీకృష్ణ ఆలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆలయాల్లో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం వైభవంగా నిర్వహిం చారు.
అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి.
మహిళలను ఆదు కోవడానికి రాష్ట్రప్రభుత్వం స్త్రీ శక్తి పథకం సూపర్ సిక్స్ పథకా ల్లో ఒకటని, శుక్రవారం మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్లో మదన పల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రారంభించారు
మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు.
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజంపేట ఆర్అండ్బి ఆవరణంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, న్యాయవాది టి.లక్ష్మీనారాయణ, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్నాయుడు, జిల్లా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అద్యక్షులు గీతాంజలి రమణ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా మున్సిపాలిటీ పరిదిలో మాంసం దుకాణాలు మూసివేయాలని మాంసం విక్రయాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు.
మండలంలో మంజూరు చేసిన పీఎం ఆవాస్ యోజన పక్కా గృహాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే రద్దవుతాయని, దాని ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ సొమ్ము వెనక్కు ఇచ్చేయాల్సి వస్తుందని మండల ప్రత్యేక అధికారి పవన్కుమార్రెడ్డి లబ్ధిదారులకు సూచించారు.
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని కూడా అమలు చేస్తోంది.
కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.