Home » KADAPA
మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.
కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.
ఖరీ ఫ్ సీజన్, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.
యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు.
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఏడాది పొడవునా టమోటా పంట సాగుచేస్తుంటారు. ఏ సమయంలో చూసినా మండలంలో రెండువేల ఎకరాలకుపైగా టమోటా సాగులో ఉంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్ల కేటాయింపునకు ఇవాళ (18వ తేదీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11 బార్లు ఉండగా, నూతన పాలసీ ప్రకారం మరో బార్ కల్లుగీత కులానికి చెందిన వారికి కేటాయించనున్నారు.
కనుమ రహదా రుల్లో (ఘాట్ రోడ్లు) వెళ్లే బస్సుల్లో మహిళలు నిల్చొని ప్రయాణించడంపై నియంత్రణ పాటించను న్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రాము వెల్లడిం చారు. తాజాగా అందిన సూచనల మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.