• Home » KADAPA

KADAPA

YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..

YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Pulivendula ZPTC BY Election: నువ్వా నేనా.. పులివెందులలో టీడీపీ VS వైసీపీ వార్

Pulivendula ZPTC BY Election: నువ్వా నేనా.. పులివెందులలో టీడీపీ VS వైసీపీ వార్

మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్‌చుప్‌గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.

Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ప్రచారం.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం

Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ప్రచారం.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం

అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

Kadapa: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..

Kadapa: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..

మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.

YSRCP Leaders: బెదిరింపుల కేసులో వివేకా హత్య కేసు నిందితులకు నోటీసులు

YSRCP Leaders: బెదిరింపుల కేసులో వివేకా హత్య కేసు నిందితులకు నోటీసులు

Notice To YSRCP Leaders: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి కండిషన్ బెయిల్ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ఉన్నారు. దీంతో పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి వారికి నోటీసులు అందించారు.

Minister Savita: పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు : మంత్రి సవిత

Minister Savita: పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు : మంత్రి సవిత

తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌‌లో వివరించారు.

Kadapa: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సంచలన కామెంట్స్.. వైసీపీ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తోంది

Kadapa: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సంచలన కామెంట్స్.. వైసీపీ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తోంది

పులివెందులలో వైసీపీ గత రెండు రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికలబరి నుంచి తప్పుకునేందుకు తాపత్రయం పడుతున్నట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఎమ్మెల్సీ ఆయన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

SP Ashok Kumar: పూర్తి భద్రత మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు..

SP Ashok Kumar: పూర్తి భద్రత మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు..

పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. కడప పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి