Home » KADAPA
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి.
కోళ్ల ఫారాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే ఫారాలను సీజ్ చేస్తామని తహసీల్దార్ తపశ్విని, ఎంపీడీఓ రమేష్ హెచ్చరించారు. గురువారం రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లి వద్ద నున్న కోళ్ల ఫారాలను తనిఖీ చేసిన వారు మాట్లాడుతూ కోళ్ల ఫారాల వ్యర్థాలు, చనిపోయి న కోళ్ల ద్వారా ఈగలు ప్రబలకుండా బాయిలర్ చేసి వాసన రాకుండా శానిటేషన్ చేయాలని తెలిపారు.
స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అన్నింటా విజేతలై నిలిచి సత్తాచాటారు. గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు పోటాపోటీగా సాగాయి.
రైతన్నలు పంటలకు సేంద్రియ ఎరువు లు వాడేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా వ్యవసా యాధికారి శివనారాయణ పేర్కొన్నారు. తరిగొండలో యూరియా వాడకంపై రైతు లకు ఆయన అవగాహన క ల్పించారు. పంటలకు సేంద్రి య ఎరువులు వినియోగిం చాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసా యంపై మొగ్గు చూపాలన్నారు. ఇందు కు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలు గ వాడాలన్నారు.
మండల రైతులు నానో(లిక్విడ్) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్కుమార్ సూచించారు.
పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.
ఒకరినొకరు వదలలేని ప్రేమాను రాగాలు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం. 62 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దంపతులను వృద్ధాప్య సమస్యలు వెంటా డాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ బిడ్డలకు భారం కాకూడద ని నిశ్చయించుకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.
మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి.