Home » Jubilee Hills By-Election
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్ధీన్కు ఇద్దరు గన్మెన్లను ఎందుకు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మరికొద్ది రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రౌడీలకు, మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటమని, ఇందులో మహిళనే గెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ బలహీన వర్గాల కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పలు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ కు ఇప్పటి వరకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు.