Home » Jasprit Bumrah
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కెరీర్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.
ఇంగ్లండ్తో ధర్మశాల మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
పలు నివేదికల ప్రకారం ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దూరంకానున్నాడు. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం.
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్గా, బుమ్రా భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. పెళ్లయ్యాక కూడా ఆమె తన వృత్తిని కొనసాగిస్తోంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీ్సలో భారత్ తొలి టెస్టు ఓడినా.. రెండో టెస్టులో అద్భుత పోరాటం కనబర్చింది. పేసర్ బుమ్రా తన పదునైన బౌలింగ్తో పర్యాటక జట్టును హడలగొట్టడంతోనే...
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
తన సంచలన బౌలింగ్తో 90 ఏళ్ల నాటి రికార్డును బుమ్రా బద్దలుగొట్టాడు. 1934లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్ అమర్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.