Home » Jasprit Bumrah
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించాడు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గువాహటి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గతంలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కొడుకు కలిసి సరదాగా గడిపాడు. బుమ్రా కుమారుడు అంగద్ బౌలింగ్ చేసిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుమ్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. బుమ్రాపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనతో రీల్ చేయాలంటే బుమ్రా ఇంకా ఎక్కువ వికెట్లు పడగొట్టాలని తెలిపాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ బుమ్రా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
కటక్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో స్టార్ పేసర్ బుమ్రా మరో ఒక్క వికెట్ తీస్తే.. ఈ ఫార్మాట్లో వంద వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి వర్క్లోడ్ కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి కీలక సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్కే ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసరమైతేనే టెస్టులు ఆడాలని అశ్విన్ పేర్కొన్నాడు.