Home » Jammu and Kashmir
జమ్ముకశ్మీర్లో సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. ప్రాథమిక సమాచారం మేరకు భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది.
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.
జమ్ము కశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ లోయలో భారీగా మంచు చరియలు విరిగిపడి ఉప్పెనలా దూసుకొచ్చిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పార్లమెంటు సమావేశాల్లో హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిల్ కానీ, కస్టడీ పెరోల్ కానీ ఇవ్వాలని రషీద్ ఇటీవల కోరారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు గతవారం ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి ప్రశాంత్ శర్మ నోటీసులు జారీచేశారు.
జమ్మూకశ్మీర్లో ఆర్మీ వాహనం అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
లద్దాక్ ఏర్పాటుపై ప్రజలు ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారని, జమ్మూకశ్మీర్లో తిరిగి కలవాలని కోరుకుంటున్నవారు అంతకంతకూ పెరుగుతున్నారని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
భారత్- పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. జమ్మూ బార్డర్లో పాకిస్థాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత్ సైన్యం అలర్ట్ అయ్యింది.
జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొన్ని డ్రోన్లు ముఖ్యంలో నౌషెరా-రాజౌరీ సెక్టార్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే భారత సైనిక విభాగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. మీడియం, లైట్ మిషన్గన్లతో కాల్పులు జరిపాయి.