Home » Jammu and Kashmir
దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
జమ్మూకశ్మీర్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్సె, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలు ఖరారైనట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారంనాడు ప్రకటించారు. పొత్తులో భాగంగా జమ్మూకశ్మీర్, లడఖ్లో చెరో 3 సీట్లలో ఎన్సీ, కాంగ్రెస్ పోటీ చేయనుట్టు తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని 5 పార్లమెంటరీ స్థానాల్లో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోంది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ , జమ్మూ-కశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్టాప్ బుఖారితో చర్చలకు బీజేపీ రాష్ట్ర విభాగం ప్రయత్నాలు చేస్తోంది. సజ్జద్ లోన్, బుఖారితో చర్చలు జరిపేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్చార్జి తరుణ్ చుగ్ ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్నారు.
లడఖ్(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ - రాజౌరీ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
మార్చి30: జమ్ము కశ్మీర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో 27 మంది స్టార్ కాంపేయనర్లు పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
జమ్మూ నుంచి శ్రీనగర్(Jammu Srinagar) వెళ్తున్న ప్యాసింజర్ SUV క్యాబ్(SUV skidded) రాంబన్ ప్రాంతంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో టాక్సీ 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో అందులో 10 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 44పై రాంబన్లోని చష్మా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటలకు ప్రమాదం జరిగింది.
ఆదివారం జమ్మూకశ్మీర్ తొలిసారిగా ఫార్ములా - 4 ఈవెంట్కు శ్రీనగర్ వేదిక అయ్యింది.
లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శనివారంనాడు ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ .. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.