Home » Jammu and Kashmir
కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి.
జమ్మూకశ్మీర్ కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులపై దాడి చేశారు.
జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్బల్, బడ్గాం నియోజవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం గందేర్బల్ నియోజకవర్గాన్ని తనవద్దే ఉంచుకుని బడ్గాంను వదులుకున్నారు.
జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్షా చెప్పారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
నాలుగు రాజ్యసభ సీట్లలో మొదటి రెండింట్లో ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆశించినప్పటికీ రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించింది.
విపరీతంగా మంచు కురుస్తుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో లాన్స్ హవాల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోయ్ల జాడ గల్లంతైంది. వీరి కోసం గ్రౌండ్ ట్రూప్స్, లోకల్ సపోర్ట్ టీమ్లు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి.
కెరాన్ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటం, ఎల్ఓసీ వెంబడి వాతావరణ ప్రతికూలతల కారణంగా మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. మిలిటెంట్లు ఎవ్వరూ తప్పించుకుపోకుండా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న ల్యాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు గుర్తించామని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. వారు సమయం కోసం వేచిచూస్తున్నారని, అయితే ఆర్మీ, బీఎస్ఎఫ్ అధునాతన నిఘా సాధనాలతో అప్రమత్తంగా ఉందని చెప్పారు.