Home » Israel
కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్లు బుధవారం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా, ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది.
హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏమీ లేదా?.. అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో చిక్కుకున్న అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన ఫైటర్ ను సురక్షితంగా కాపాడిన తీరును ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అభినందనలు తెలిపారు.
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్కు విమాన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు.
పశ్చిమాసియాలో యుద్ధ భయం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.