Home » Israel
హమాస్ అధినే ఇస్మాయిల్ హినియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన నాటి నుంచి తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..
మొస్సాద్..! ఇజ్రాయెల్కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది.
గాజా(Gaza) నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్.. శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు.
అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
ఇజ్రాయెల్లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.