Home » Iran War
ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 30 వేల డాలర్లు (దాదాపు రూ.29 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
ఒమన్తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కేవలం సాంకేతికపరమైన నావిగేషన్ మార్గాల ఖరారు కోసమేనని, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి దీనికి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
ఇరాన్తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.