ఒప్పందం ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలు.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక..
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:53 AM
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరోపించారు. మరోసారి తమపై ఒత్తిడి తీసుకొస్తే తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు (Iran US News).
ఇరుదేశాల మధ్య దౌత్య చర్చలకు మాత్రం తలుపులు పూర్తిగా మూసివేయలేదని ఆ ప్రతినిధి సంకేతాలు ఇచ్చినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అలాగే చర్చలను కొనసాగించాలని అమెరికాను టెహ్రాన్ కోరిందన్న ట్రంప్ వాదనలను కూడా ఆయన ఖండించారు. 'మేము అమెరికాతో చర్చలు జరపాలని కోరలేదు. కానీ ఖతార్ మధ్యవర్తుల ఇరాన్ పర్యటనను అంగీకరించాము' అని ఆయన పేర్కొన్నారు (Iran reciprocal action).
'యుద్ధాన్ని ముగించడం ప్రపంచ దేశాలకు అవసరమే. కానీ ఇరాన్ లొంగిపోయినంత మాత్రాన ఈ ఘర్షణ ముగియదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి (US Iran ceasefire). అమెరికన్లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉంటాము. మేము వారికి వ్యతిరేకంగా పోరాడి ఇరాన్ ప్రజల హక్కులను కాపాడుకుంటాము' ఇరాన్ అగ్ర సంధానకర్త మహమ్మద్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్కు 24 గంటల గడువు.. హోర్ముజ్పై అమెరికా తుది హెచ్చరిక..