Home » Iran War
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఇరాన్తో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న దానికి ప్రతీకారంగా, ఇరాన్పై అమెరికా భారీ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలు కావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 2.6 శాతం పెరిగి 76.1 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది.
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్తో తాము శాంతి ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్ను పూర్తిగా ముగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది.
టెహ్రాన్లో ఇవాళ ప్రారంభమైన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు ఆయన ముగ్గురు కుమారులు హాజరయ్యారు. తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా మాత్రం అక్కడ కనిపించలేదు.
ఇరాన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఇరాన్ అగ్రనేతలు.. యుద్ధ విరమణ కోసం జరిపే శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లపై ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన 'హత్య కుట్ర'ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఒక సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.