Home » IPL
తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ చేసిన ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సీఎస్కేకి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లోనూ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల కుర్రాడి వికెట్ తీయడం కోసం ప్రపంచ మేటి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైభవ్ వికెట్ తీయగానే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
ఐపీఎల్ 2026 మరో కీలక సమరానికి సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సీఎస్కే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్జీ బ్యాటింగ్కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రాజస్థాన్కు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. దాదాపు లీగ్ స్టేజ్ కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో మే 1 వరకు జరిగిన మ్యాచ్ల టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ డేటా లెక్కల ఆధారంగా బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికను రూపొందించింది. సీఎస్కే మ్యాచ్లకు అత్యధిక మంది వీక్షిస్తున్నట్లు అందులో వెల్లడైంది.
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు.
టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులు జారీ చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేశారు. కేకేఆర్కు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు.