Home » IPL
గత కొన్ని రోజులుగా పంజాబ్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్లలో క్రమశిక్షణ, సమన్వయం లోపించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఇన్ స్టా స్టోరీ తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అదిరే ఆటతో అందరి దృష్టిని తనవైపే తిప్పుకున్న పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు అనూహ్యంగా దెబ్బతింటోంది. వరుస ఓటముల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని.. తమకు మద్దతు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61) ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో 500కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో అభిమానులు సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారనే విషయాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది.
ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
పంజాబ్ కింగ్స్పై జరిగిన కీలక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో డీసీ యువ ఆల్రౌండర్ మాధవ్ తివారీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అసలు ఇంతకీ ఎవరీ మాధవ్ తివారీ...!