Home » International News
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది.
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ కారణంగా కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు చిక్కుకున్నాయి. జపాన్ నుంచి దుబాయ్ చేరాల్సిన 4 వేల కార్లు కెన్యా పోర్టులో నిలిచిపోయాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుంది. ప్రాదేశిక జాలాల్లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? తాజాగా ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్న సమయంలో ట్రంప్ను చూసిన వారిలో ఈ సందేహం మొదలైంది. అంతకు ముందు రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కుర్చీలో కూర్చునేందుకు కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు.
అమెరికా, యూకేల ఉమ్మడి ప్రతిష్ఠాత్మక సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా, మరొకదానిని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకుని, ధ్వంసం చేశాయి.
బ్రిటన్ నుంచి అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లవుతున్న సందర్భంగా.. ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24 క్యారెట్ల బంగారు నాణేన్ని విడుదల చేసేందుకు అమెరికా మింట్...
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, సహజవాయు మౌలిక వసతులపై దాడులు జరగటం, స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. అలాగే పొరుగు దేశాలపై దాడులను కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు.