Home » International News
ఇరాన్తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు జారీచేసినట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్.
హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇరాన్ స్పందించింది.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్పై దాడి చేయాలని పాకిస్థాన్పై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచుతోంది. ఈ సందర్భంగా గతేడాది తమతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని గుర్తుచేస్తోంది.
ఇరాన్- అమెరికా యుద్ధంలో ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణానికి కూడా కోలుకోలేని నష్టం జరుగుతోంది. ఈ యుద్ధంలో తొలి 14 రోజుల్లోనే వాతావరణంలోకి ఏకంగా...
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరిచి, నౌకల స్వేచ్ఛా రవాణాకు వీలుకల్పించాలని.. లేకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో ‘లిటిల్ ఇండియా’గా పిలిచే డిమోనా నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. శనివారం ఈ నగరంపై జరిపిన దాడుల్లో 33 మంది గాయపడగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్కు చెందిన మినీ జలాంతర్గాములు ప్రధాన ముప్పుగా మారాయి. చిన్నగా ఉండి శబ్ధం తక్కువగా చేసే ఘదీర్ సబ్మెరైన్లను ‘సైలెంట్ హంటర్లు’గా పిలుస్తారు.
తమ దేశంలోని నతాంజ్ అణుకేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది.