Home » International News
అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనే ఆశలను పూర్తిగా వదులుకునేవరకు ఇరాన్ పోర్ట్లపై, నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈ దిగ్బంధనాన్ని ఇనుప కవచంగా పేర్కొన్న హెగ్సెత్, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు.
యుద్ధం మొదలైన తొలి రోజునే అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొని ప్రపంచాన్ని అబ్బురపరిచింది. అధికారాలను, బాధ్యతలను ఎక్కడికక్కడ వికేంద్రీకరించడంతో అన్ని విభాగాలు చక్కటి సమన్వయంతో అమెరికా, ఇజ్రాయెల్పై ఎదురుదాడికి దిగాయని విశ్లేషణలు వినిపించాయి.
భారత్, చైనాలను నరక కూపాలుగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ పోస్టుపై ఆగ్రహించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్.. మహారాష్ట్ర గొప్ప సాంస్కృతిక, భౌగోళిక వారసత్వాన్ని వివరిస్తూ ఓ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాల నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మార్గంలో....
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అంతరాయం వల్ల కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను అమరస్తున్న ఇరాన్ నౌకలపై దాడులు చేయాలని ఆదేశించారు. ఆ పడవలు ఎంత చిన్నవైనా సరే, వాటిని కాల్చేసి, వాటిల్లోని సిబ్బందిని మట్టుబెట్టాలని అమెరికా నౌకా దళానికి సూచించారు.
పర్షియన్ గల్ఫ్లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించాలనే ఒత్తిడి తనపై లేదన్నారు.
తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించటంతో చమురు విక్రయం ఆగిపోయి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్.. దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్ గల్ఫ్లోని సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ...
పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.