Home » International News
భారత్లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు గట్టి దెబ్బ తగలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడైన మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించాడు.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
ఇరాన్ గనక తమతో త్వరలో ఒప్పందం కుదుర్చుకొని, హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే.. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఖార్గ్ దీవిని, చమురు బావులను, ఇరాన్ విద్యుదుత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామని, సర్వనాశనం చేసేస్తామని అమెరికా....
ఇరాన్కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్లోకి ప్రవేశిస్తున్నారు.
అమెరికాతో సంధి చర్చల కోసం ఇరాన్ ముందుకొచ్చింది. కానీ ఐదు షరతులను ముందు పెట్టింది. వాటికి అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది....
ఇరాన్లోని మినాబ్లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.
దుబాయ్లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్జీసీ వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.